
బాగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో ఎనిమిదవ వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నాడు బిగ్ బాస్. అదేంటంటే.. ఈ వారం ఇంటినుండి శోభా(Shobha) బయటకు వెళ్తుందని అందరూ అనుకున్నారు. అదే రేంజ్ లో ఓటింగ్ కూడా జరిగింది. ఈ ఓటింగ్ లో ఇద్దరికి చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది. ఆ ఇద్దరు మరెవరో కాదు శోభా శెట్టి, సందీప్(Sandeep).
నిజానికి ఈ ఇద్దరి ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ఇద్దరు నామినేషన్స్ లోకి వస్తారా.. ఎప్పుడు బయటకు పంపించేద్దామా అని చూస్తున్నారు కానీ.. అనూహ్యంగా ఈ ఇద్దరూ ఒకేసారి నామినేషన్స్ లోకి వచ్చారు. దీంతో ఆడియన్స్ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. కొంతమంది శోభా వెళ్లిపోవాలని కోరుకుంటుంటే.. మరికొందరేమో సందీప్ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. దీంతో ఈ వారం సమానమైన ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది.
అయితే శనివారం ఉదయం వరకు శోభానే ఈ వారం ఎలిమినేట్ అవుతుందని ఆనందపడ్డారు కానీ.. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు బిగ్ బాస్ సీజన్ 7 నుండి ఫస్ట్ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నాడు అని తెలుస్తోంది. అతను మరెవరో కాదు సందీప్. కారణం గత ఏడూ వారాలుగా సందీప్ నామినేషన్స్ లో లేకపోవడం, సీజన్ మొదట్లో ఫౌల్ గేమ్స్ ఆడటం, పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేయడం వంటివి అతనికి మైనస్ గా మారాయి. దీంతో సందీప్ కు తక్కువ ఓటింగ్ పడింది. దీనివల్ల శోభా సేఫ్ అయ్యి సందీప్ ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.