బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే

బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలు వేరు కావచ్చని… కానీ, అవినీతిలో రెండు పార్టీలను ఒకేలా చూడాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ దోచుకుందని… ఇప్పుడు ఆ స్థానంలోకి బీజేపీ వచ్చిందన్నారు. బీజేపీ పాలనలో పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోందన్నారు.

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల జీవితాలను నాశనం చేస్తాయని… ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సీఎం కేజ్రీవాల్. ఈ బిల్లులను రూపొందిస్తున్న సమయంలో సంబంధిత కమిటీలో ఉన్న ఒక కాంగ్రెస్ నేత బీజేపీని అభినందించారని… ఆ బిల్లులు చట్టరూపం దాల్చాక వాటిని విమర్శిస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలను మూర్ఖులు అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్.