హైదరాబాద్ జలమండలి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాటర్ బోర్డుకు ప్రకటించిన రూ. 500 కోట్లను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్పొరేటర్లు. వాటర్ బోర్డు ఎండీ దాన కిషోర్ ను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు, నేతలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కార్పొరేటర్లు. తర్వాత ఐదుగురిని మాత్రమే ఆఫీస్ లోకి అనుమతించారు పోలీసులు. వాటర్ బోర్డు ఎండీ దాన కిషోర్ అందుబాటులో లేకపోవడంతో మరో అధికారిని కలిసి మెమోరాండం ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం
భారత్లో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు
సోనూసూద్కు పంజాబ్ పోలీసులు షాక్