సోనూసూద్‌కు పంజాబ్ పోలీసులు షాక్

సోనూసూద్‌కు పంజాబ్ పోలీసులు షాక్

బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్‌కు పంజాబ్ పోలీసులు షాక్ ఇచ్చారు. పంజాబ్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఆదివారం పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోనూసూద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై మోగాలో కేసు నమోదైంది. సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్‌లో చేరి మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. పోలింగ్ రోజును తన సోదరి కోసం సోనూ ప్రచారం చేస్తూ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళికి సంబంధించి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఆయన ధిక్కరించడంతో కేసు నమోదు చేసినట్టు మోగా పోలిసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:  

సమ్మర్‌లో కూల్ వాటర్ తాగుతున్నారా ?

రజనీ,ఐశ్వర్య రాయ్ కొత్త సినిమా