కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నేత బండ్రు శోభారాణి

కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నేత బండ్రు శోభారాణి

బీజేపీ నేత బండ్రు శోభారాణి కాంగ్రెస్ లో చేరారు. అమెరికాలో ఓవర్సీస్ కాంగ్రెస్ నేతృత్వంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ నేత బండ్రు శోభారాణి కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన శోభారాణి ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రెండు రోజుల క్రితం  రాజీనామా చేశారు. రేవంత్, మధుయాష్కీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నేతలు ఖండువా కప్పి శోభారాణిని పార్టీలోకి ఆహ్వానించారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన బండ్రుశోభారాణి గతంలో టీఆర్ఎస్, టీడీపీ,నవతెలంగాణ, ప్రజారాజ్యం పార్టీల్లో పనిచేశారు. రెండేళళ్ల క్రితం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆమె  రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇప్పటికే ఆలేరు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా  బీర్ల ఐలయ్య ఉన్నారు. మరి  ఆలేరు నుంచి పోటీచేయాలనుకుంటున్న ఆమెకు  కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందా లేదా? చూడాలి.

 

నయన్ -విఘ్నేశ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో !