ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ త్వరలో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారనే వార్తలు ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది. తిరుమల సన్నిధిలో వచ్చే నెల 9న వీరి వివాహం జరగనుందని మొన్నటి వరకూ టాక్ రాగా... తాజాగా ఆ వేదికలో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుందని... అందుకు కావల్సిన ముందస్తు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని సమాచారం. కాగా నయన్- విఘ్నేశ్ పెళ్లి వేడుకకు ఆహ్వానించేందుకు ఓ వీడియో రూపొందించారని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోలో ఉన్నది ఎంత వరకూ నిజమో తెలియదు గానీ... ఇప్పుడు అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఇప్పటికే ఎన్నో షేర్ లను సొంతం చేసుకుంది. ఈ వీడియోలో ఉన్న వివరాల ప్రకారం జూన్ 9న మహాబలిపురంలోని మహబ్ హోటల్ లో వీరి పెళ్లి జరగనుంది. ఇకపోతే దాదాపు 7ఏళ్ల నుంచి ఈ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరి ఎంగేజ్ మెంట్ కూడా కరోనా లాక్ డౌన్ లోనే జరిగిపోయిందని నయన్ ఓ సినిమా ప్రమోషన్ లో వెల్లడించిన సంగతి కూడా విధితమే.
You saw it here first! #FirstonPinkvilla: We got our hands on #Nayanthara and #VigneshShivan's wedding invite ?? How pretty is this digital invite! ??@pinkvilla @PinkvillaSouth #Nayanthara #wedding #Nayantharawedding pic.twitter.com/H8vSIsekkh
— Pinkvilla South (@PinkvillaSouth) May 27, 2022
మరిన్ని వార్తల కోసం....
ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి
బిహార్ లో భారీ గోల్డ్ మైన్