ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న  కొత్త పంబన్ బ్రిడ్జి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వంతెన నిర్మాణ పనులు సాగుతున్నాయని, ఈ డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక చేశామని అధికారులు వెల్లడించారు. దాదాపు100 సంవత్సరాల కిందట నిర్మించిన పురాతన వంతెన ఇప్పటికీ అందుబాటులో ఉండగా.. దాని స్థానంలో మరింత అధునాతనంగా, సాంకేతికంగా దృఢంగా ఉండేందుకు ఈ కొత్త నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. దీని కోసం దాదాపు రూ.560కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుతం ఈ వంతెనపైనుంచి  రైళ్లు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడపగలవని, కొత్త వంతెనపై గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చని అధికారులు తెలిపారు.

 

 రామేశ్వరం, ధనుష్కోడికి ఆధ్యాత్మిక యాత్రను సందర్శించాలనే  భక్తులకు, యాత్రికులకు ఈ కొత్తగా నిర్మించే వంతెన ఒక వరంలాంటిది కానుందన్నమాట. పాత వంతెన సింగిల్-లైన్, నాన్-ఎలక్ట్రిఫైడ్ విభాగం కాగా..  కొత్తది డబుల్-లైన్, ఎలక్ట్రిఫైడ్ రైల్వే ట్రాక్ ను కలిగి ఉంటుంది. పాత వంతెనపై సరుకు రవాణా రైళ్లను నిషేధించామని, అయితే వాటిని కొత్త వంతెనపైకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇకపోతే కొత్త వంతెన గత ఏడాది సెప్టెంబరులోనే ప్రారంభించాల్సి ఉండగా.. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా అది ఆలస్యం అయిందని  చెప్పారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఆల్ట్రా మోడ్రన్ డ్యూయల్-ట్రాక్ బ్రిడ్జి భారతదేశపు మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా అవతరించనుంది. 

 

మరిన్ని వార్తల కోసం...

శ్రీలంకలో 50 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు