విద్యా శాఖ నిర్లక్ష్యం వల్లే నారాయణ కాలేజీ వంటి ఘటనలు

విద్యా శాఖ నిర్లక్ష్యం వల్లే నారాయణ కాలేజీ వంటి ఘటనలు

హైదరాబాద్: కార్పొరేట్ కాలేజీలకు కేసీఆర్ కుటుంబం వత్తాసు పలుకుతోందని బీజేపీ నాయకుడు దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. నారాయణ కాలేజీ ఘటనలో గాయపడ్డ విద్యార్థి నాయకులు సందీప్, వెంకటేశ్ చారిలను అపోలో హాస్పిటల్ లో ఆయన పరామర్శించారు. అనంతరం వారికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ... విద్యా శాఖ నిర్లక్ష్యం వల్లే కార్పొరేట్ కాలేజీల్లో ఫీజు నియంత్రణ లేకుండా పోయిందన్నారు. విద్యార్థులకు మేలు చేయాల్సిందిపోయి... కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలను ప్రసన్నం చేసుకునే పనిలో విద్యా శాఖ అధికారులున్నారని ఫైర్ అయ్యారు.

సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే ప్రైవేట్ కాలేజీలు ఇష్టమొచ్చినట్లు ఫీజులు పెంచుతున్నాయని మండిపడ్డారు. కాలేజీ ఫీజుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలన్నారు. నారాయణ కాలేజీ ఘటనలో గాయపడ్డ సందీప్, వెంకటేశ్ చారిలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.