
గద్వాల టౌన్, వెలుగు: గద్వాల చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు వీ హబ్ తీసుకొచ్చామని ఆ సంస్థ చైర్మన్ సీత, బీజేపీ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్ సంతోష్ ను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జోగులాంబ గద్వాల హ్యాండ్లూమ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు, మహిళా చేనేత కార్మికుల కెపాసిటీని వృద్ధి చేసేందుకు, వారికి ఆర్థిక, డిజిటల్, మార్కెటింగ్ లింకేజీతో జీవనోపాధి కల్పించేందుకు వీ హబ్ కృషి చేస్తుందన్నారు.
ఈ ప్రాజెక్టును సక్సెస్ చేసేందుకు జిల్లా అధికారులు సహకరించాలని కోరారు. వీ హబ్ లక్ష్యాలు, కార్యాచరణ కలెక్టర్ కు వివరించారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే చేనేత కళకు మరింత గుర్తింపు వస్తుందన్నారు. వీ హబ్ డైరెక్టర్ జాయిద్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ పాల్గొన్నారు.