భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా.. మురళీధర్ రావు ట్వీట్

భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా.. మురళీధర్ రావు ట్వీట్

మాల్కజిగిరి పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు పార్టీ పట్ల ఆసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన చేసిన సంచలన ట్వీట్ వైరల్ గా మారింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ 195 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ నుంచి తొమ్మది మంది అభ్యర్థులను ప్రకటించింది. 

ముగ్గురు సిట్టింగ్ లకు తిరిగి టికెట్లు కేటాయించగా..  మాల్కజిగిరి సీటును ఆశించిన  మురళీధర్ రావుకు కాకుండా ఈటెల రాజేందర్ కు అవకాశం ఇచ్చింది. దీంతో అసహనానికి గురైన  మురళీధర్ రావు నిన్న ఎక్స్ లో సంచలన ట్వీట్ చేశారు.   

Also read : మా ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది:మంత్రి పొన్నం

In the last few years, my associates, colleagues, dedicated workers of the party and well wishers who toiled with me in conducting campaigns, events, and various engagements in Malkajgiri Loksabha constituency, I extend my heartfelt thanks to all of them. Very soon, I will…

‘మల్కాజ్‌గిరిలో నా కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే నా అనుచరులను, కార్యకర్తలను వ్యక్తగతంగా కలుస్తా. ఆపై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా’ అని ఎక్స్ వేదికగా మురళీధర్ రావు పోస్టు పెట్టారు.  దీంతో  ఆయన పార్టీ మారుతారా  అన్న ప్రచారం మొదలైంది.  దీనిపై  మురళీధర్ రావు  క్లారిటీ ఇవ్వాల్సి ఉంది