కేసీఆర్ అవినీతిపైవిచారణ జరపండి:బీజేపీ నేత రవీంద్ర నాయక్

కేసీఆర్ అవినీతిపైవిచారణ జరపండి:బీజేపీ నేత రవీంద్ర నాయక్
  • రాష్ట్రపతి, ఈడీ, సీబీఐలకు బీజేపీ నేత రవీంద్ర నాయక్ ఫిర్యాదు 

న్యూఢిల్లీ, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల అవినీతిపై దర్యాప్తు జరపాలని బీజేపీ నేత రవీంద్ర నాయక్ కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి, కేంద్ర హోం శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలకు లేఖలు రాశారు. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. అధికారం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు.

పుష్కరాల పేరిట దాదాపు రూ.1,200 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ నిధులను దారిమళ్లించారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా పక్కదారి పట్టించారని ఆరోపించారు. విలువైన ప్రభుత్వ భూములను కొట్టేశారన్నారు. వీటిపై విచారణ జరిపి ఆ నిధులను ప్రజలకు చేరేలా చూడాలని తన లేఖలో కోరినట్లు చెప్పారు.