
హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ కార్యాలయ ముట్టడికి NSUI కార్యకర్తలు ప్రయత్నించారు. నాంపల్లిలో ఉన్న కార్యాలయంలోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నించారు. ముందుగానే సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు బయటకు వచ్చి.. వారితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీజేపీ స్టేట్ ఆఫీసు వద్ద ట్రాఫిక్ స్తంభించింది. ఇటీవలే ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వీడియో, పొటోలు విడుదల చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫొటోలు, వీడియోలు విడుదల చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రఘునందన్ రావుపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. అందులో భాగంగానే సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించింది. ముట్టడిని బీజేపీ కార్యకర్తలు ఖండించారు. దమ్ముంటే తెలంగాణ భవన్ లేదా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాలని సూచించారు. రఘునందన్ రావు విడుదల చేసిన ఫొటోలు బర్న్ చేసి ఉన్నాయని బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ ను ప్రశ్నించాలన్నారు. NSUI కార్యకర్తలను అరెస్టు చేసి వివిధ పీఎస్ లకు తరలించారు.
మరిన్ని వార్తల కోసం : -
వాతావరణ శాఖ చల్లటి కబురు
అభివృద్ధి కోసం అందరం కలిసి పని చెయ్యాలి