దళితుల భవిష్యత్  బాగుండాలంటే ఈటలను గెలిపించాలి

దళితుల భవిష్యత్  బాగుండాలంటే ఈటలను గెలిపించాలి

దళితుల భవిష్యత్  బాగుండాలంటే   హుజురాబాద్ ఉపఎన్నికల్లో  ఈటల రాజేందర్ కు ఓటేయాలన్నారు  బీజేపీ నేషనల్   ఎగ్జిక్యూటివ్ కమిటీ  మెంబర్ వివేక్ వెంకటస్వామి. వీణవంక మండలం  ఎలబాకలో  దళితులతో మాట్లాడారు  వివేక్ వెంకటస్వామి. దళితబంధును కేసీఆర్  మరిచిపోకుండా ఉండాలంటే... ఈటలను  గెలిపించాలన్నారు. ఈటల గెలిపిస్తేనే  కేసీఆర్ మెడలు వంచి  పని చేయిస్తారని  చెప్పారు. ఒక్క దళిత  కుటుంబానికి  60 లక్షలు రావాల్సి ఉండగా... పది  లక్షలే  ఇస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్ర ఖజానాలో డబ్బులే లేవన్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టులో  65వేల కోట్ల కుంభకోణం  జరిగిందన్నారు  వివేక్ వెంకటస్వామి.