బీజేపీ నేతల ధర్నా.. కీసరలో ఉద్రిక్తత

బీజేపీ నేతల ధర్నా.. కీసరలో ఉద్రిక్తత

అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో కీసర ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

ఈ క్రమంలో కార్యకర్తలతో కలిసి ఆర్డీవో ఆఫీసులోకి చొచ్చుకువెళ్లారు. అప్పటికే బందోబస్తు నిర్వహించిన పోలీసులకు నిరసనకారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కట్టినా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులకు ఇవ్వకపోడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.  

కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలకు ఇళ్లు కేటాయించారని వారు ఆరోపిస్తూ.. ఆర్డీఓ కార్యాలయం గేటు తోసుకొని  ఆర్డీఓ ఛాంబర్ లోకి దూసుకెళ్లి ఏవోని కలిశారు. సమస్యను వివరించిన అనంతరం పోలీసులు వారిని అక్కడినుంచి పంపేశారు.