సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది: రఘునందన్

సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది: రఘునందన్

నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దోచుకుంటున్నాడని ఆరోపించారు. సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది అన్నట్లుగా పరిస్థితి తయారైందని వాపోయారు. 

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఉపాధి హమీ పథకం నిధులపై చర్చకు సిద్దమా అంటూ కేటీఆర్కు రఘునందన్ సవాల్ విసిరారు . దీనిపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమా అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో పాలక, ప్రతిపక్షాల బాధ్యత ఒకే విధంగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ధర్నాలు చేస్తే అరెస్ట్ చేసే పోలీసులు, బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు.