గోషామహల్ లో జాతీయ జెండా ఎగురవేస్తే జైలుకేనంట

గోషామహల్ లో జాతీయ జెండా ఎగురవేస్తే జైలుకేనంట

గోషా మహల్ నియోజకవర్గంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తే జైలుకు పంపుతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రతి ఏడాది ఆగస్ట్ 15న బేగం బజార్ లో చిన్న ర్యాలీ తీస్తామని తెలిపారు. అయితే ఈసారి ర్యాలీకి పర్మిషన్ ఇవ్వమని పోలీసులు చెప్పారన్నారు రాజాసింగ్. ర్యాలీ ఎలా చేస్తారో..? జెండా ఎలా ఎగురవేస్తారో చూస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా జెండా ఎగురవేస్తామని, ర్యాలీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నిజాం లాగా పాలన చేస్తున్నారని విమర్శించారు.