తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు: తిప్పస్వామి

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు: తిప్పస్వామి

కొత్తగూడ, వెలుగు: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కర్నాటకలోని రాయచూర్​ రూరల్​ బీజేపీ ఎమ్మెల్యే తిప్పస్వామి తెలిపారు. మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడలో బీజేపీ పార్టీ ఆఫీస్​ను మంగళవారం ములుగు జిల్లా అధ్యక్షుడు భాస్కర్​ రెడ్డి, మహబూబాబాద్​ జిల్లా అధ్యక్షుడు రాంచందర్​రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత మోదీదన్నారు.

.ములుగులో రూ.900 కోట్లతో గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. నవంబర్​ 15న ఆదివాసీ గౌరవ దివాస్​గా నిర్వహిస్తున్నారన్నారు. కాంగ్రెస్​ గ్యారంటీలను నమ్మవద్దని సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.