బ్లాక్ మనీని వైట్​గా మారుస్తున్నరు...ఈడీకి బీజేపీ ఎంపీ ఫిర్యాదు

బ్లాక్ మనీని వైట్​గా మారుస్తున్నరు...ఈడీకి బీజేపీ ఎంపీ  ఫిర్యాదు
  • రాజస్థాన్  సీఎం కుటుంబ సభ్యులపై ఈడీకి బీజేపీ ఎంపీ  ఫిర్యాదు

జైపూర్: రాజస్థాన్  సీఎం అశోక్  గెహ్లాట్ కుటుంబ సభ్యులతో పాటు మరి కొందరిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోడీలాల్  మీనా ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్(ఈడీ) కు ఫిర్యాదు చేశారు. సీఎం సంపాదించిన బ్లాక్ మనీని వైట్​గా మార్చేందుకు షెల్  కంపెనీలను వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం కొడుకు వైభవ్ గెహ్లాట్, ఆయన బిజినెస్ అసోసియేట్​పై హవాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని  డిమాండ్​ చేశారు.

దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు ఉన్న ఆ బిజినెస్ మ్యాన్ తో వైభవ్ కు సంబంధాలు ఉన్నాయన్నారు. వైభవ్, మరికొందరు పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని, బినామీ పేర్లతో ట్రాన్సాక్షన్లు నిర్వహించారని ఆరోపించారు. మారిషస్​కు చెందిన షెల్  కంపెనీ ద్వారా బ్లాక్  మనీని వైట్​గా మారుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.