రాష్ట్ర సర్కార్ ప్రజావ్యతిరేక చర్యలు ఎండగట్టాలి : బీజేపీ ఓబీసీ మోర్చా

రాష్ట్ర సర్కార్ ప్రజావ్యతిరేక చర్యలు ఎండగట్టాలి :  బీజేపీ ఓబీసీ మోర్చా

హైదరాబాద్‌‌, వెలుగు : బీసీలకు రాష్ట్ర సర్కారు చేస్తున్న అన్యాయాలను సోషల్‌‌ మీడియా ద్వారా  ఎండగట్టాలని బీజేపీ ఓబీసీ మోర్చా నిర్ణయించింది. ఆదివారం మోర్చా రాష్ట్ర ఐటీ, సోషల్ మీడియా సెల్ కన్వీనర్ ప్యారసాని వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ రాజ్, మోర్చా జాతీయ ఐటీ, సోషల్ మీడియా మెంబర్స్ పెరిక సురేశ్, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ ముఖ్యఅతిథిగా అటెండ్ అయ్యి, మాట్లడారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.

గరీబ్‌‌ కల్యాణ్‌‌ యోజన పథకం ద్వారా కేంద్రం ప్రతి ఒక్కరికి నెలకు అదనంగా 5కిలోల బియ్యం అందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.  హైవేలు, రహదారులు నిర్మాణంలో కేంద్రం అందిస్తున్న సాయంపై అవగాహన కల్పించాలని తెలిపారు. కేసీఆర్‌‌ సర్కార్ చేస్తున్న అన్యాయాలని సోషల్ మీడియా ద్వారా చర్చకు తీసుకురావాలని స్పష్టం చేశరు. కార్యక్రమంలో ఐటీ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సురేశ్ కిరణ్, జిల్లాల మోర్చా ఐటీ, సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.