భారత వేరియంటా?.. కాంగ్రెస్ దేశాన్ని అవమానిస్తోంది

భారత వేరియంటా?.. కాంగ్రెస్ దేశాన్ని అవమానిస్తోంది

న్యూఢిల్లీ: భారత కరోనా వేరియంట్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ అయ్యింది.  ఇది దేశాన్ని అవమానించడమేనని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. 'ఇండియన్ కరోనాయే మన గుర్తింపు, నా భారత్ ఓ కొవిడ్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు. ఇది భారత్ ను అవమానించడమే. ఇలాంటి భ్రమలు, భయాలను వ్యాప్తి చేస్తూ కరోనాపై యుద్ధాన్ని బలహీనం చేస్తున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలు ఎందుకు చేస్తోందో సోనియాజీ జవాబివ్వాలి' అని జవదేకర్ పేర్కొన్నారు.