సత్యేందర్ కా దర్బార్.. వీడియోపై బీజేపీ సెటైర్లు

సత్యేందర్ కా దర్బార్.. వీడియోపై బీజేపీ సెటైర్లు

తీహార్ జైలులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఖైదీలతో మీటింగ్  వీడియో బయటకు రావడం తీవ్ర దుమారం రేపుతోంది.  ఇప్పటికే  జైన్ మసాజ్ చేయించుకుంటున్న, స్పెషల్ ఫుడ్ తింటున్న వీడియోలు బయటికి రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ఆయనకు వీఐపీ ట్రీట్ మెంట్ అందుతోందనే ఆరోపణలతో జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను కూడా సస్పెండ్ చేశారు. అయితే సత్యేంద్ర జైన్ వీడియోలపై  బీజేపీ  సెటైర్లు వేస్తున్నారు.  ఈ సారి సత్యేందర్ కా దర్బార్ జైలు సూపరింటెండెంట్‌ని సస్పెండ్ చేశారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జై హింద్ ట్వీట్‌ చేశారు.


ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన నిన్న మరొకటి బయటకొచ్చింది. జైలులోని తన సెల్ లో ఆయన కొందరితో సమావేశమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్ లో బెడ్ పై రిలాక్స్ అవుతున్న జైన్.. ముగ్గురితో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. వాళ్లందరూ టీషర్ట్, షార్ట్, నైట్ ప్యాంట్ లాంటి క్యాజువల్ క్లాత్స్ వేసుకున్నారు. సస్పెండ్ అయిన తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ కొద్దిసేపటికి అక్కడికి రాగా, సెల్ లో ఉన్న ముగ్గురూ బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత జైన్, అజిత్ కుమార్ చాలాసేపు మాట్లాడుకున్నారు. అజిత్ కుమార్ కుర్చీలో కూర్చోగా, జైన్ తన బెడ్ పై పడుకున్నారు. ఇది సెప్టెంబర్ 12న రాత్రి 8 గంటల ప్రాంతంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీ అని వీడియోలో కనిపిస్తోంది.