హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఉరుకోవొద్దు : బండి సంజయ్

హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఉరుకోవొద్దు : బండి సంజయ్

రాష్ట్రంలో వచ్చే 8 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని.. బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. బీఆర్ఎస్లో అంతా దొంగలున్నారని విమర్శించారు. బీజేపీలో ప్రజల కోసం పని చేసే కార్యకర్తలు, నేతలున్నారని చెప్పారు. 

అయ్యప్ప స్వామిని కించపరిస్తే కేసీఆర్ స్పందించలేదని బండి సంజయ్ ఆరోపించారు. భాగ్యలక్ష్మి అమ్మవారు, సరస్వతి దేవిని కించపరిచినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు.ఎవరైన హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఉరుకోమని హెచ్చరించారు. దీనికి పార్టీ పర్మిషన్ అవసరం లేదని చెప్పారు. ఈ నెల 19న పరేడ్ గ్రౌండ్ లో జరిగే మోడీ సభను విజయవంతం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.