
మజ్లిస్ కు టీఆర్ఎస్ భయపడుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో OBC మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆయన.. లౌకికవాదంపై మాట్లాడే హక్కు టీఆర్ఎస్ కు లేదన్నారు. హింసకు అవకాశం లేకుండా CAAపై అవగాహన కల్పించాలని సూచించారు. మజ్లిస్ ను కట్టడిచేసే సామర్థ్యం బీజేపీకే ఉందన్నారు. CAA వ్యతిరేక శక్తులను ఏకాకులను చేయాలని.. మార్చి 17న CAAపై భారీ సభ నిర్వహిస్తామన్నారు.