GHMC ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం

GHMC ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయం సాధించడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు ఆయువుపట్టు లాంటి దుబ్బాకలోనే గెలిచామని, ఇకపై ఈ జోరును రాష్ట్రవ్యాప్తంగా చూపిస్తామన్నారు. దుబ్బాక ఎన్నిక ఫలితం రాష్టవ్యాప్తంగా ఉంటుందని…త్వరలో జరగనున్న GHMC ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు కిషన్ రెడ్డి.

దుబ్బాక విజయం బీజేపీకి ఎంతో బలాన్నిస్తుంది.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందన్నారు కిషన్ రెడ్డి. దుబ్బాక విజయం ప్రజల విజయమన్నారు. బీహార్ లోనూ బీజేపీ హవా కొనసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు.