V6 News

బెంగాల్ విభజన లేకుండానే గూర్ఖాల్యాండ్ సమస్యను పరిష్కరిస్తాం: అమిత్ షా

బెంగాల్ విభజన లేకుండానే గూర్ఖాల్యాండ్ సమస్యను పరిష్కరిస్తాం: అమిత్ షా

గంగారాంపూర్/ మాణిక్‌‌‌‌చక్: బెంగాల్‌‌‌‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర విభజన లేకుండానే డార్జిలింగ్ కొండల్లోని గూర్ఖా ల్యాండ్ సమస్యను రాజ్యాంగబద్ధంగా పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మంగళవారం దక్షిణ దినాజ్‌‌‌‌పూర్ జిల్లా గంగారాంపూర్‌‌‌‌, మాణిక్​చక్, గజోల్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 

తమ పార్టీ అధికారంలోకి రాగానే.. కొండ ప్రాంతాల్లో గూర్ఖా సోదరుల కోసం ఎకో -అడ్వెంచర్ హబ్​ను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో రాజకీయ హింస, సిండికేట్ సంస్కృతి, కట్-మనీ రాజ్యాన్ని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. 

టీఎంసీ నాయకత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రొటోకాల్ ​పాటించకుండా అవమానిస్తోందన్నారు. మమతా బెనర్జీ గూండాలను అదుపు చేయడానికి ఈసీ కేంద్ర బలగాలను మోహరించిందని చెప్పారు.