కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ రిజిస్ట్రార్ జయలక్ష్మిని ఆ పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని బీజేవైఎం, ఏబీవీపీ, బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. సోమవారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో రిజిస్ట్రార్కు మద్దతుగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఉయ్ స్టాండ్ విత్ వీసీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు.
నాయకులు చల్ల రామకృష్ణారెడ్డి, పితాని సందీప్ మాట్లాడుతూ.. దాదాపు ఐదున్నర దశాబ్దాల తర్వాత వర్సిటీ వీసీ ఒక బీసీ మహిళను రిజిస్ట్రార్గా నియమిస్తే.. జీర్ణించుకోలేని కొందరు ఆమెను బదిలీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నాయకులు జయరాం, సాయిరాం, మనీష్, కారుణ్య, రామ్, ఉదయ్, రాజ్కుమార్ పాల్గొన్నారు.
