RCB vs SRH మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్స్ దందా.. అరెస్ట్ చేసిన పోలీసులు

RCB vs SRH మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్స్ దందా.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న వారిపై దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గురువారం ఉప్పల్ స్టేడీయంలో జరిగిన సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ కి బ్లాక్ లో టికెట్స్ అమ్ముతున్నారని పక్కా సమాచారం రావడంతో తనిఖీ చేశారు పోలీసులు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారివద్ద 101 టికెట్స్, రెండు సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. నిందితులు బెంగుళూరుకు చెందిన  రమణ, హైదరాబాద్ కు చెందిన న్యాలకంటి శామ్యూల్ గా గుర్తించారు. 

SRH VS RCB మ్యాచ్ టార్గెట్ గా చేసుకొని ఐపీఎల్ టికెట్స్ అధిక ధరలకు విక్రయాలు జరిపారని  గుర్తించామన్నారు పోలీసులు. వన్డే ప్రపంచ కప్ సమయంలో బ్లాక్ లో టికెట్స్ అమ్ముతూ చెన్నై లో అరెస్టు అయిన నిందితుడు రమణ అనే పోలీసులు నిర్ధారించారు. ఐపీఎల్ కి విపరీతమైన డిమాండ్ ఉండడంతో టికెట్ల విక్రయాలకు ఇద్దరు స్కెచ్ వేసి బ్లాక్ దందాకు తెరతీశారని పోలీసులు తెలిపారు. వెయ్యికి పైగా వాట్సాప్,టెలిగ్రామ్ గ్రూపులు నిందితులు నడుపుతున్నట్టు టాస్క్ ఫోర్స్ గుర్తించామన్నారు.