రేవంత్ రెడ్డి సమక్షంలో .. కాంగ్రెస్ లో చేరిన బోడుప్పల్ నేతలు

రేవంత్ రెడ్డి సమక్షంలో .. కాంగ్రెస్ లో చేరిన బోడుప్పల్ నేతలు

మేడిపల్లి, వెలుగు: కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి బోడుప్పల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నేతలు పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ సమన్వయ కర్త తోటకూర వజ్రేశ్​యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పోగుల నర్సింహా రెడ్డి నేతృత్వంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారినుద్దేశించి మాట్లాడుతూ మరో తొంభై రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అందుకు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. మేడ్చల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో మాజీ వార్డు సభ్యుడు, సీనియర్ నేత బొమ్మకు రమేష్, మాజీ ఎంపీటీసీలు దేవరకొండ వీరాచారి, తోటకూర అశోక్ యాదవ్, టీడీపీ1 వవార్డు కంటెస్టెంట్ రసాల కుమార్ యాదవ్,3 వ వార్డు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ దుడేళ్ల రాజు ముదిరాజ్, యువ నాయకుడు పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొన్నం తరుణ్ గౌడ్, మేడ్చల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్, కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్, బొమ్మకు కళ్యాణ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రధానా కార్యదర్శులు కొత్త ప్రభాకర్  గౌడ్, విశ్వం గుప్త, సీనియర్ నాయకులు బాలరాజ్ గౌడ్, రాపోలు శంకరయ్య, పోగుల వీరారెడ్డి, సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుర్రి శివ శంకర్, పోగుల దిలీప్ రెడ్డి, తోటకూర రాజు యాదవ్, హరినాథ్ రెడ్డి,సింగిరెడ్డి రాజు రెడ్డి, కందుకూరి నవీన్, రాజు, చీరాల జంగయ్య, సాయి  పాల్గొన్నారు.