నగరంలో బొజ్జ గణపయ్య మరికొద్ది గంటల్లో కొలువుదీరేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు మండపాలు అందంగా ముస్తాబు అయ్యాయి. మరోవైపు విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా కనిపించాయి. పలు ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లకు ఇరువైపులా విగ్రహాల అమ్మకాలతో రద్దీగా మారాయి.
Also Rard: యువతకు సందేశం ఇచ్చే రజాకార్
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లాంటి ప్రభుత్వ, పలు స్వచ్ఛంద సంస్థలు విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. ధూల్పేట్, ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో విగ్రహాల అమ్మకాలు ఆఖరి రోజు జోరుగా కొన సాగాయి. దీంతో ఆదివారం రోడ్లపైకి జనాలు రావడంతో ఉదయం నుంచే సిటీలో ట్రాఫిక్ రద్దీ కనిపించింది.
వెలుగు, ఫొటోగ్రాఫర్