శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్

శంషాబాద్, వెలుగు: శంషాబాద్  ఎయిర్​పోర్టకు కు శనివారం రాత్రి బాంబు పెట్టామని, మరికొద్ది క్షణాల్లో ఎయిర్​పోర్టును  పేల్చేస్తానని జీఎంఆర్ కాల్ సెంటర్ కు ఫోన్ కాల్​ వచ్చింది. దీంతో  సీఐ ఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ బృందాలతో రోజంతా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎయిర్​పోర్టులో ఎలాంటి బాంబు లేదని అధికారులు గుర్తించారు. ఇది ఫేక్ కాల్ గా కాల్​ చేసిన వ్యక్తిని అదుపులోకి  తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.