ఎమ్మెల్యే సునీత 15 ఎకరాలు కబ్జా చేశారు: బోరెడ్డి అయోధ్య రెడ్డి

ఎమ్మెల్యే సునీత 15 ఎకరాలు కబ్జా చేశారు:  బోరెడ్డి అయోధ్య రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: టీఎస్​ఐఐసీ పరిధిలోని 15 ఎకరాల భూమిని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కబ్జా చేశారని పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కాకముందు  తెల్ల రేషన్​కార్డు ఉన్న ఆమెకు  ఇప్పుడు వందల కోట్లు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. ‘‘టీఎస్​ఐఐసీ కోసం తుర్కపల్లిలో భూ సేకరణ చేస్తున్నారు. 

సర్వే నంబర్​ 72లో 155 ఎకరాల భూమి ఉంటే.. 108 ఎకరాల భూమికి నోటిఫికేషన్​ ఇచ్చారు. అందులో టీఎస్​ఐఐసీ తీసుకున్నది 93 ఎకరాలు. మిగతా 15 ఎకరాలు ఎమ్మెల్యే సునీత కబ్జా చేశారు. 43 మంది రైతుల దగ్గర తీసుకున్న భూమికి ప్రభుత్వం చెక్కులు ఇచ్చినా.. అవి బౌన్స్​ అయ్యాయి’’ అని అయోధ్య రెడ్డి అన్నారు.