హైరైజ్ టవర్స్ తో ..హైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో ఎండిపోతున్న బోర్లు

హైరైజ్ టవర్స్ తో ..హైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో ఎండిపోతున్న బోర్లు

ఔటర్​ రింగ్​ రోడ్​(ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగరంలో పలు ప్రాంతాల్లో అనూహ్యంగా బోర్లు ఎండిపోతున్నాయి. నగరంలో రోజుకు 300 నుంచి 500 బోర్లు ఎత్తిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం  మెట్రో వాటర్ బోర్డు అధికారులు చేసిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా వెస్ట్ సిటీతోపాటు ఉప్పల్, ఎల్బీనగర్​, ఇబ్రహీంపట్నం, హయత్‌‌నగర్‌‌‌‌లాంటి ప్రాంతాల్లో బోరుబావులు చాలా త్వరగా ఎండిపోతున్నట్టు అధికారులు తెలిపారు.

గ్రేటర్​ పరిధిలో ముఖ్యంగా ఔటర్​ రింగ్​రోడ్​ వెంట భారీ ఎత్తున హైరైజ్‌‌​ భవనాలు వెలుస్తున్నాయి. కోకాపేట, నార్సింగి, వట్టి నాగులపల్లి, గండిపేట, కొండాపూర్, మియాపూర్, తెల్లాపూర్, పటాన్‌‌చెరు, మాదాపూర్, హైటెక్​సిటీ, ఇటు ఉత్తరాన ఘట్‌‌​కేసర్, ఉప్పల్, ఎల్బీనగర్‌‌‌‌, హయత్​నగర్​, ఉత్తరాన మేడ్చల్​, జీడిమెట్ల, పేట్​బషీరాబాద్, కొంపల్లిలాంటి ప్రాంతాల్లో భారీ సంఖ్యలో హైరైజ్​ భవనాలు నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే నార్సింగి, కోకాపేట, తెల్లాపూర్‌‌‌‌లాంటి ప్రాంతాల్లో  60 అంతస్తుల భవనాలు వెలిశాయి.

►ALSO READ | గ్రౌండ్ వాటర్ వినియోగంలో హైదరాబాద్ సిటీ కన్నా ఢిల్లీనే నయం

ఇలాంటి భారీ నిర్మాణాలకు తప్పనిసరిగా నీటి అవసరం పెద్ద ఎత్తున ఉంటుంది. దీంతో వేల అడుగుల్లో బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు.  మరోవైపు వర్షపు నీటిని భూమిలోకి పంపించేలా రెయిన్​వాటర్​హార్వెస్టింగ్​ (ఇంకుడు గుంతల నిర్మాణం) మాత్రం పెద్దగా జరగడం లేదు. నగరమంతా కాంక్రీట్​జంగిల్‌‌గా మారిపోతున్న కారణంగానే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి భవనంలోనూ వర్షపునీరు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని మెట్రోవాటర్​బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 30 వేల ఇంకుడు గుంతల నిర్మాణం లక్ష్యంగా పని చేస్తున్నట్టు తెలిపారు.