పబ్ లో 9 మంది యువకులపై బౌన్సర్ల దాడి

 పబ్ లో 9 మంది యువకులపై బౌన్సర్ల దాడి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేసియా లాంజ్ పబ్ లో బౌన్సర్లు రెచ్చిపోయారు. ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వచ్చిన యువకులపై బౌన్సర్లు దాడి  చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పబ్ కు వచ్చిన యువకులు.. వాష్ రూమ్ లో నాప్కిన్స్  కిందపడేశారని..బౌన్సర్లు రెచ్చిపోయి యువకులను ఇష్టమోచ్చినట్లు బూతులు తిట్టారు. యువకులు అడ్డుచెప్పటంతో బౌన్సర్లు దాడి చేశారు. తొమ్మిది మంది యువకులపై బౌన్సర్లు  ఎటాక్ చేశారు. గాయపడిన యువకులు…కార్తీక్ రెడ్డి, చంద్రకిరణ్ రెడ్డి, నవీన్ శరత్ చంద్ర జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.