బౌలర్ల సత్తా: ఒకే రోజు 24 వికెట్లు

బౌలర్ల సత్తా: ఒకే రోజు 24 వికెట్లు

పటియాలా: ఆంధ్ర, పంజాబ్‌‌ మధ్య రంజీ మ్యాచ్‌‌లో ఇరు జట్ల బౌలర్లు చెలరేగడంతో ఒకే రోజు 24 వికెట్లు పడ్డాయి. ఎలైట్‌‌ గ్రూప్‌‌–ఎలో భాగంగా  మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌‌లో టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన ఆంధ్ర ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 97 రన్స్‌‌కే కుప్పకూలింది.  బోడపాటి సుమంత్‌‌ (22), కేవీ శశికాంత్‌‌ (20) టాప్‌‌ స్కోరర్లు. ఓపెనర్లు జ్ఞానేశ్వర్‌‌ (0), డీబీ ప్రశాంత్‌‌ (0)తో పాటు స్వరూప్‌‌ కుమార్‌‌ (0), ఆశిష్‌‌ (0)డకౌటవగా.. ప్రణీత్‌‌ (5), రిక్కీ భుయ్‌‌ (11), గిరినాథ్‌‌ (1) ఫెయిలయ్యారు. పంజాబ్‌‌ బౌలర్లలో సిద్దార్థ్‌‌ కౌల్‌‌ (5/24) హ్యాట్రిక్​ సహా ఐదు వికెట్లతో చెలరేగాడు.

అనంతరం ఆంధ్ర బౌలర్లు షోయబ్‌‌ ఖాన్‌‌ (5/46), ఆశిష్‌‌ (5/50) చెరో ఐదు వికెట్లతో విజృంభించగా పంజాబ్‌‌ ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 108 రన్స్‌‌కే ఆలౌటైంది. కెప్టెన్‌‌ మన్‌‌దీప్‌‌ సింగ్‌‌ (23) టాప్‌‌ స్కోరర్‌‌. ఆ జట్టులో ముగ్గురు డకౌటయ్యారు. ఆపై, సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌ స్టార్ట్‌‌ చేసిన ఆంధ్ర మొదటి రోజు చివరకు 31/4తో కష్టాల్లో పడింది. ఓపెనర్లు ప్రశాంత్ (0), జ్ఞానేశ్వర్‌‌ (5), ప్రణిత్ (13), సుమంత్‌‌ (1) ఔటవ్వగా కెప్టెన్‌‌ రిక్కీ భుయ్‌‌ (8 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఆంధ్ర 20 రన్స్‌‌ లీడ్‌‌లో ఉంది.

మరిన్ని వార్తల కోసం..