కారు రివర్స్ చేస్తుండగా.. కారు కింద పడి బాలుడు మృతి

కారు రివర్స్ చేస్తుండగా.. కారు కింద పడి బాలుడు మృతి

మల్కాజిగిరిలో దారుణం జరిగింది. ఆనంద్ బాగ్‌లోని వెంకట్ ప్లాజా అపార్ట్‌మెంట్లో కారు రివర్స్ తీస్తుండగా అయిదు సంవత్సరాల బాలుడు చక్రాల కింద పడి మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా, మగనూర్ మండలానికి చెందిన రంగప్ప మల్కాజిగిరిలోని వెంకట్ ప్లాజాలో నివాసముంటున్నాడు. ఆయనకు 5 సంవత్సరాల వయసు గల తరుణ్ అనే కొడుకున్నాడు. శుక్రవారం ఉదయం తరుణ్ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలోనే అపార్ట్‌మెంట్‌కి చెందిన వ్యక్తి కారును రివర్స్ తీస్తుండగా.. బాలుడు కారు వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

For More News..

22 ఏళ్ల కుర్రాడి ప్రేమలో 60 ఏళ్ల బామ్మ

రెండు బిల్డింగ్‌ల మధ్య 17 ఏళ్ల అమ్మాయి అనుమానాస్పద మృతి

ఆమెను కూడా నిర్భయ దోషులలాగే జైళ్లో పెట్టాలి