డెంగ్యూ తో బాలుడు మృతి

డెంగ్యూ తో బాలుడు మృతి

నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్ష కుంటలో డెంగ్యూతో ఓ బాలుడు చనిపోయాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన వారణాసి భిక్షపతి స్వరూపల చిన్న కొడుకు హర్షత్ (11) చెన్నారావుపేట సిద్దార్థ స్కూల్​లో ఆరో తరగతి చదువుతున్నాడు.

ఇటీవల జ్వరం రావడంతో తల్లిదండ్రులు నర్సంపేటలోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తీసుకువెళ్లారు. అయినా, తగ్గకపోవడంతో ఆదివారం వరంగల్​లోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు.