బ్రహ్మాస్త్ర ట్రైలర్‌ పై సెలబ్రిటీల రెస్పాన్స్

 బ్రహ్మాస్త్ర ట్రైలర్‌ పై సెలబ్రిటీల రెస్పాన్స్

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బ్రహ్మాస్త్ర ట్రైలర్‌ను బుధవారం ఉదయం మేకర్స్ రిలీజ్ చేశారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి డైరెక్టర్. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ , స్టార్‌లైట్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ తో మొదలైన ట్రైలర్ లలో ప్రతి సీన్ విజువల్ వండర్ గానే కనిపిస్తోంది. నీరు, నిప్పు, అగ్ని లాంటి వాటికి అస్త్రాలుగా ఉండేవారి కథే బ్రహ్మాస్త్రం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ అస్త్రాలకు సమానంగా శక్తి ఉండే పాత్రలో రణబీర్ కపూర్ కనిపించనున్నారు. ఈ సినిమాని 2022 సెప్టెంబర్ 9న హిందీ,తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. మొత్తానికి చిత్ర ట్రైలర్‌ సినిమా పైన భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ పైన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 


"చాలా అద్భుతంగా ఉంది. అమేజింగ్.. స్టన్నింగ్ "  అని అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ పోస్ట్ చేసింది. 


రితీష్ దేశ్‌ముఖ్ స్పందిస్తూ దీనిని వెండితెర మీద చూడడానికి వేచి ఉండలేను. అభినందనలు కరణ్ అని పోస్ట్ చేశాడు. 


అనుష్క శర్మ స్పందిస్తూ  బ్రహ్మాస్త్ర ట్రైలర్‌ పిధా అయిపోయాను.. సినిమాని చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అని పోస్ట్ చేసింది. 


రణబీర్ తల్లి నీతూ కపూర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ట్రైలర్‌ను షేర్ చేస్తూ దర్శకుడుని అభినందించింది. అద్భుతంగా ఉంది అంటూ కితాబిచ్చింది.