ప్రాపర్టీ హ్యాండోవర్ చేసేందుకు  రూ.11 వేలు లంచం

ప్రాపర్టీ హ్యాండోవర్ చేసేందుకు  రూ.11 వేలు లంచం
  • రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు 

ఎల్​బీనగర్, వెలుగు : ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు (బైలిఫ్) రూ. 11 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్​గా ఏసీబీకి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు కె. రామకిషన్ అలియాస్  రామకృష్ణ, డి. వెంకటేశ్వర్లు ఓ ప్రాపర్టీ కేసులో బాధితులకు పొజిషన్ ప్రాపర్టీ ఇచ్చేందుకు కె. శారద అనే లాయర్ వద్ద లంచం డిమాండ్ చేశారు.

దీంతో ఆమె  ఏసీబీఅధికారులకు ఫిర్యాదు చేసింది. సోమవారం రామకిషన్, వెంకటేశ్వర్లు  కోర్టుకు వెళ్లి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064​కు కాల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.