టీమ్ ఇండియా క్రికెటర్లకు బ్రిటన్ గుడ్ న్యూస్

టీమ్ ఇండియా క్రికెటర్లకు బ్రిటన్ గుడ్ న్యూస్

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ కు వెళ్లనుంది. జూన్ 18న న్యూజిలాండ్ తో ఫైనల్స్ లో తలపడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇదే సమయంలో మహిళల క్రికెట్ జట్టు కూడా ఇంగ్లండ్ పర్యటించనుంది. మిథాలీ రాజ్ సేన ఇంగ్లండ్ తో టెస్టు, వన్డే సిరీస్ ఆడనుంది. హర్మన్ ప్రీత్ నాయకత్వంలో మూడు టీ20లు ఆడనుంది.

మరోవైపు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న పురుషులు, మహిళల జట్ల సభ్యులంతా ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్ లో ఉన్నారు. ఈ సందర్భంగా టీమిండియా సభ్యులకు బ్రిటన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇంగ్లండ్ టూర్ సుదీర్ఘంగా ఉండటంతో..ఆటగాళ్లు వారి కుటుంబసభ్యులను కూడా ఇంగ్లండ్ కు తీసుకురావడానికి అనుమతించింది. ఇప్పటికే కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతించింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆటగాళ్లు జూన్ 3న ఇంగ్లాండ్ లోని సౌథాంప్టన్ చేరుకోగానే అక్కడి హోటళ్లలో 3 రోజుల పాటు కఠిన క్వారంటైన్ లో ఉంటారు.  ఆ తర్వాత నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.