
- కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్అనే రైతు ఆత్మహత్య వెనుక బీఆర్ ఎస్ కార్యకర్తలు ఉన్నారని కిసాన్ కాంగ్రెస్ సెల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి ఆరో పించారు. రైతు పోస్ట్ చేసిన వీడియోలో బీఆర్ఎస్ కార్యకర్తల మాటలు వినిపి స్తున్నాయని తెలిపారు. పురుగుల మందును రెచ్చగొట్టి తాగించడం వల్లే రైతు చనిపోయాడని చెప్పారు.
బుధ వారం గాంధీభవన్ లో కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ప్రజలు తిరస్కరించినా, ప్రతిపక్షంలో కూర్చొబెట్టినా వాళ్లకు బుద్ధి రాలేదని విమర్శించారు.