ఆదివారం (మార్చి 31) కేసీఆర్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే

ఆదివారం (మార్చి 31) కేసీఆర్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్  ఇదే

ఎండిన పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపట్నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.   ఎండిన పంటలను పరిశీలించిన, బాధిత రైతులకు భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలోనే.. సూర్యాపేట‌, న‌ల్లగొండ, జ‌న‌గామ జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో కేసీఆర్ ప‌ర్యటించనున్నారు. ఆదివారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి జిల్లాల ప‌ర్యట‌న‌కు రోడ్డు మార్గంలో బ‌య‌ల్దేరుతారు. జ‌న‌గామ జిల్లాలోని ధ‌రావ‌త్ తండాకు ఉద‌యం 10:30 గంట‌ల‌కు చేరుకుంటారు. 

అక్కడ ఎండిన పొలాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. 11:30కు సూర్యాపేట జిల్లాలోని తుంగ‌తుర్తి, అర్వప‌ల్లి, సూర్యాపేట రూర‌ల్ మండ‌లాల్లో ప‌ర్యటించి, ఎండిపోయిన పంట పొలాల‌ను ప‌రిశీలిస్తారు. మ‌ధ్యాహ్నం 1 గంట‌లకు సూర్యాపేట రూర‌ల్ మండ‌లం నుంచి బ‌య‌ల్దేరి.. 1:30 వ‌ర‌కు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. అక్కడే భోజనం చేస్తారు. 

అనంతరం మూడు గంటలకు  మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతారు.  మ‌ధ్యాహ్నం 3:30కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి న‌ల్లగొండ జిల్లాకు బ‌య‌ల్దేరుతారు. సాయంత్రం 4:30 గంట‌ల‌కు నిడ‌మ‌నూరు మండ‌లానికి చేరుకుని ఎండిపోయిన పంటల‌ను ప‌రిశీలించ‌నున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు నిడ‌మ‌నూరు నుంచి తిరిగి ఎర్రవెల్లికి బ‌య‌ల్దేరతారు. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి రాత్రి 9 గంట‌ల‌కు ఫాంహౌజ్ చేరుకుంటారు. 

  • Beta
Beta feature
  • Beta
Beta feature