కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఫిర్యాదు

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఫిర్యాదు

    వారిపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్ కు విజ్ఞప్తి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికై, కాంగ్రెస్‌‌‌‌లో చేరిన ఎమ్మెల్సీలపై శాసన మండలి చైర్మన్‌‌‌‌  గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయించిన పట్నం మహేందర్‌‌‌‌ ‌‌‌‌రెడ్డి, కూసుకుంట్ల దామోదర్‌‌‌‌ ‌‌‌‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరింది. శుక్రవారం జూబ్లీహిల్స్‌‌‌‌లోని చైర్మన్‌‌‌‌  నివాసానికి ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు , యాదవ రెడ్డి, శేరి శుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం.రమేష్ రెడ్డి  తదితరులు వెళ్లి చైర్మన్ ను కలిశారు. కాగా, ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌పై మరుసటి నాడే స్పీకర్‌‌‌‌‌‌‌‌కు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేయడానికి మాత్రం చాలా ఆలస్యం చేసింది.