హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలుస్తామని, కేసీఆర్హ్యాట్రిక్సీఎం అవుతారని బీఆర్ఎస్నేత దాసోజు శ్రవణ్కుమార్అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం రూ.6 వేల కోట్ల బిల్లులు ఇప్పించారని కాంగ్రెస్పార్టీ ఈసీకి లేఖ రాయడం వారి లేకి తనానికి నిదర్శనమన్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్మీటింగ్ఎలా పెడతారని రేవంత్రెడ్డి సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ప్రజాస్వామ్య పద్ధతులు తెలుసా అని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా ఏ సీఎం అయినా కేబినెట్సమావేశం పెట్టాలని, దానికి సంప్రదాయాలు ఉన్నాయని, పద్ధతి ప్రకారమే తర్వాతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
ఈ ప్రభుత్వానికి టర్మ్జనవరి 16 వరకు ఉందని గుర్తు చేశారు. ఈమాత్రం సోయి లేకుండా రేవంత్చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.