అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లలో గెలుస్తం : దాసోజు శ్రవణ్

అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లలో గెలుస్తం :  దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలుస్తామని, కేసీఆర్​హ్యాట్రిక్​సీఎం అవుతారని బీఆర్ఎస్​నేత దాసోజు శ్రవణ్​కుమార్​అన్నారు. శనివారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం రూ.6 వేల కోట్ల బిల్లులు ఇప్పించారని కాంగ్రెస్​పార్టీ ఈసీకి లేఖ రాయడం వారి లేకి తనానికి నిదర్శనమన్నారు. 

ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్​మీటింగ్​ఎలా పెడతారని రేవంత్​రెడ్డి సోషల్​మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ప్రజాస్వామ్య పద్ధతులు తెలుసా అని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా ఏ సీఎం అయినా కేబినెట్​సమావేశం పెట్టాలని, దానికి సంప్రదాయాలు ఉన్నాయని, పద్ధతి ప్రకారమే తర్వాతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 

ఈ ప్రభుత్వానికి టర్మ్​జనవరి 16 వరకు ఉందని గుర్తు చేశారు. ఈమాత్రం సోయి లేకుండా రేవంత్​చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.