బీఆర్ఎస్ ను బలహీనపర్చేందుకు కాంగ్రెస్, బీజేపీల కుట్రలు: రావుల శ్రీధర్ రెడ్డి

బీఆర్ఎస్ ను బలహీనపర్చేందుకు కాంగ్రెస్, బీజేపీల కుట్రలు: రావుల శ్రీధర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను బలహీనపర్చేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేత రావుల శ్రీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలను బీజేపీ, కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలను అవినీతిపరులని ఆరోపిస్తూనే వారిని బీజేపీ, కాంగ్రెస్ లు తమ పార్టీల్లోకి ఎందుకు చేర్చుకుంటున్నాయని ప్రశ్నించారు. 

గిరిజన భూములను ఆక్రమించుకున్నారని సైదిరెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ గతంలో ఆందోళనలు చేసిందని.. ఇప్పుడు ఆయనకే నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చిందని రావుల గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని రావుల పిలుపునిచ్చారు. దళితుల భూములు ఆక్రమించుకున్న ఈటల రాజేందర్ కు బీఆర్ ఎస్ పై విమర్శలు చేయడం తగదని ఆయన మండిపడ్డారు. కవిత అరెస్ట్ పై ఈటల అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు.