- వెంచర్ల అక్రమాలపై ఫిర్యాదు చేయడంతో అటాక్
- దవాఖానలో చేరిన బాధితుడు
ఊర్కోండ (నాగర్ కర్నూల్), వెలుగు: ‘మా వెంచర్ల మీద కంప్లయింట్ చేస్తావా’ అంటూ కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు..నర్సంపల్లి సర్పంచ్, బీజేపీ ఓబీసీ సెల్ జిల్లా వైస్ ప్రసిడెంట్ నిరంజన్పై దాడి చేశారు. నాగర్ కర్నూల్జిల్లా ఊర్కొండలోని మహబూబ్నగర్–కోదాడమెయిన్ రోడ్డుకు రెండు వైపులా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ లీడర్ముచ్చర్ల జనార్దన్రెడ్డి ఎంజేఆర్ పేరిట వెంచర్ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం, అనుమతి లేకుండా వెంచర్లు వేశారని, ప్రభుత్వ రోడ్లను కబ్జా చేశారని బీజేపీ లీడర్లు..రెవెన్యూ, డీటీసీపీ ఆఫీసర్లకు కంప్లయింట్ చేశారు. దీంతో శుక్రవారం డీటీసీపీ రీజనల్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వెంచర్ల పరిశీలనకు వచ్చారు. నర్సంపల్లి సర్పంచ్ నిరంజన్తో పాటు బీజేపీ లీడర్లకు సమాచారం ఇచ్చి రమ్మన్నారు.
దీంతో వారు వచ్చి ఆఫీసర్లకు వివరిస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరంజన్ తో పాటు ఇతర బీజేపీ లీడర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కోపంతో నిరంజన్ను కిందపడేసి తన్నారు. నిరంజన్ గాయపడగా అతడిని బీజేపీ నాయకులు కల్వకుర్తి గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరబ్రహ్మంతో కలిసి ఊర్కొండ పీఎస్లో సింగిల్ విండో డైరెక్టర్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, ఎంపీపీ భర్త జంగయ్య, ఊర్కొండ సర్పంచ్ రాజు, కల్వకుర్తి వార్డు మెంబర్ భర్త బావండ్ల మధు, కొమ్ము శ్రీను, నరేశ్, సందీప్ తదితరులపై కంప్లయింట్ఇచ్చాడు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురికాగా మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. కాగా, బీఆర్ఎస్ దాడిని నిరసిస్తూ బీజేపీ లీడర్లు కోదాడ–మహబూబ్నగర్ మెయిన్రోడ్డుపై రాస్తారోకో చేశారు.
