- మంత్రి పొన్నం ప్రభాకర్ జోలికొస్తే ఖబడ్దార్
ముషీరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడటం బంద్ చేయాలని, లేదంటే తస్మాత్ జాగ్రత్త అని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్ హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జోలికొస్తే చూస్తూ ఊరుకోమన్నారు. శుక్రవారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. బీసీ, ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలను బట్టలిప్పి కొడతా అని కేటీఆర్ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు తలుచుకుంటే మీరు ఎక్కడ కూడా తిరగరని హెచ్చరించారు.
పదేళ్లు అధికారంలో ఉండి అహంకారమదంతో బీసీ, ఎస్సీలను మాయమాటలతో మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలు ప్రజాకోర్టులో బట్టలు ఊడదీసినా.. ఇంకా మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. పదేళ్ల పాలనలో పూలే పైన లేనటువంటి అభిమానం ఇప్పుడు పుట్టుకు రావడం చాలా శోచనీయమని విమర్శించారు. అధికారంలో ఉండి మండలి, అసెంబ్లీలో పూలే విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు.