- శేరలింగంపల్లి సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ
గచ్చిబౌలి, వెలుగు : బీఆర్ఎస్ పాలనలోనే శేరిలింగంపల్లి సెగ్మెంట్ పరిధిలోని అన్ని వర్గాల అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ తెలిపారు. బుధవారం గచ్చిబౌలి డివిజన్ లోని నానక్ రాంగూడ, లోధా బస్తీ, పుకట్ నగర్, ఎస్సీ బస్తీ, చాకల బస్తీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హైదర్ నగర్ డివిజన్ హెచ్ఎంటీ శాతవాహననగర్ కాలనీవాసులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.