
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇటీవల మహిపాల్రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు అధికారులు. ఇక విచారణలో భాగంగా ఆయన ఈ రోజు జులై 02వ తేదీన ఈడీ కార్యాలయానికి వచ్చారు.