బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్బంగా ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై మే 24న సమగ్ర విచారణ జరుపుతామని వాయిదా వేసింది. సిబిఐ కేసులో కవిత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ను కూడా దాఖలు చేశారు. ఇది మే 13న విచారణకు వచ్చే అవకాశం ఉంది.
జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కవిత బెయిల్ కోసం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారించగా ఈడీకి నోటీసులు జారీ చేసింది. సమగ్ర విచారణ కోసం మే 24 కు వాయిదా వేసింది. మార్చి 15 న అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.
Delhi High Court issues notice to Enforcement Directorate (ED) on a bail plea moved by BRS leader K Kavitha in the money laundering case pertaining to the scrapped Excise policy of Delhi. Court fixes May 24 for detailed hearing in the matter.
— ANI (@ANI) May 10, 2024
K Kavitha has also moved a bail plea…