
కాంగ్రెస్ ప్రభుత్వంపై (ఎక్స్ లో ) వరుస ట్వీట్లతో తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాంధీని గాలికి వదిలి- కాంగ్రెస్ గాల్లో చక్కర్లు కొడుతుందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ కు మధ్యం ధరల పెంపుపై ఉన్న మక్కువ మందు బిళ్లలపై లేదు. విద్యుత్ చార్జీల పెంపుపై ఉన్న మక్కువ గాంధీలో మంచి నీళ్లపై లేదు. మూసీపై ఉన్న మక్కువ గాంధీలో విల్ చైర్లపై లేకపాయే. ఫోర్ బ్రదర్స్ సిటీపై ఉన్న మక్కువ గాంధీలో విరేచనాల మందులపై లేకపాయే. దీపావళికి బాంబులు వేయడంపై ఉన్న మక్కువ గాంధీలో రోగుల పై లేకపాయే. అదానీ అంబుజా సిమెంట్ పై ఉన్న మక్కువ గాంధీలో బెటాడిన్ బిళ్లలపై లేకపాయే అని తన ఎక్స్ లో కేటీఆర్ విమర్శలు చేశారు.
తెల్ల బంగారం తెల్లబోతుంది
తెలంగాణలో రైతులు పండించిన పంటకు బోనస్ దేవుడెరుగు..మద్దతు ధరకే దిక్కులేదని విమర్శించారు కేటీఆర్. పత్తి రైతు దళారుల చేతిలో చిత్తవుతున్నాడు. సీసీఐ కొర్రీలు పెట్టి..సాకులు చూపెట్టి కొనుగోళ్లు నిలిపేసింది. రైతన్న ఆగమైతుంటే..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేదు. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్లో చెప్పి..ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంది కాంగ్రెస్ సర్కారు. తెలంగాణలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట పత్తి.. కీలకమైన కాటన్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చొరవ లేదు..శ్రద్ధలేదు..ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న బుద్ధిలేదు. ఇప్పటికే..దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేసారు..సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు వేస్తున్నారు..పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారు. కర్షక ద్రోహి కాంగ్రెస్..రైతు డిక్లరేషన్ బోగస్ అని కేటీఆర్ ట్వీట్లు చేశారు.